హన్మకొండ:నేటిధాత్రి
వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి , 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ తో కలిసి హన్మకొండ, కంచరకుంటలో 65 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సిసి రోడ్డు రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ 7వ డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరమని, డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, డివిజన్ అభివృద్ధి ఏకైక లక్ష్యమని, 7వ డివిజన్ ని ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతామని, అన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ మొహమ్మద్ అజీజ్ ఖాన్, ఎం.పి ఆనంద్, బొజ్జ సమ్మయ్య యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, మంద రాకేశ్, నాగ సోమేశ్వర్ రావు, దినేష్, తోట పవన్ తదితరులు పాల్గొన్నారు