వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారని మీడియా సెల్ ఇంఛార్జి నందిమల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు . ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆలయ మర్యాదలతో రావుల కు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారని అశోక్ తెలిపారు . జాతర సందర్భంగా ఆలయ పూజారులను శ్రీవారి సేవకులను సితార వెంకటేష్ కళాకారులను రావుల సన్మానించారని తెలిపారు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరంగాపురం ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని కోరారు .భక్తులతో రావుల సరదాగా గడిపి మిఠాయిలు పంచా రని భక్తులు రావులతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారని అశోక్ తెలిపారు . రావుల వెంట బి ఆర్ ఎస్ నాయకులు కోళ్ల వెంకటేష్ రాజశేఖర్ ఎండి గౌస్ మాధవరెడ్డి అమరేందర్ కొత్తకోట బాలయ్య నాతమయ్య సందీప్ రెడ్డి ఉన్నారని అశోక్ తెలిపారు
