సగర (ఉప్పర) సంగం ఆధ్వర్యంలో శివకుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయం

నేటిధాత్రి హనుమకొండ

హనుమకొండ లోని గుండ్ల సింగారం బ్రిడ్జి వద్ద, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కీ.శే శనిగరపు శివకుమార్ యొక్క కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిస్తూ, హనుమకొండ జిల్లా సగర (ఉప్పర) సంఘం అధ్యక్షులు నలుబోల సతీష్ ఆధ్వర్యంలో శివకుమార్ భార్య పవిత్ర, మరియు కుమార్తె, కుమారుడు లను పరామర్శించి, వారి యొక్క కుటుంబ పరిస్థితిని చూసి, మానవత్వంతో దాతల సహకారంతో వారి స్వగృహం గుండ్ల సింగారంలో, హనుమకొండ సదర సంఘం ఆధ్వర్యంలో 70 వేల రూపాయలు, ఒక క్వింటాల్ బియ్యము నలుబోల సతీష్ చేతుల మీదుగా శివకుమార్ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్ సగర, తెలంగాణ రాష్ట్ర సగర సంగం కోశాధికారి వడ్ల కుమారస్వామి సగర, వీరగంటి రవీందర్ సగర, నెక్కొండ కిషన్ సగర, గుంటి శ్రీనివాసరావు, సీతా కమలాకర్ సగర, కమలాకర్ రావు, గాండ్ల స్రవంతి, కురిమిండ్ల సదానందం సగర, మంజుల, మల్లేశం, సీతా రమేష్, సీతాదుర్గ ప్రసాద్ రావు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమండ్ల అయోధ్య, సోమ కరుణ, కవిత, కుడిపాక గణేష్ సగర, మంజుల, రాజన్న, తాడిశెట్టి శ్రీధర్, వేముల వెంకన్న, వీరేందర్, మరియు సగర కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. మరణించిన కుటుంబానికి భరోసా కల్పిస్తూ, హనుమకొండ సగర సంగం ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version