రైతు నిరసన దీక్షను విజయవంతం చేయాలి

# సాగునీరు అందక ఎండుతున్న పంటలు.

#మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన హస్తం పార్టీ.

#కాలం తెచ్చిన కరువు కాదు… కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరవు….

#మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో
సకాలంలో పంటలకు సాగునీరు అందించకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని అందుకు నిరసనగా నేడు నర్సంపేట నియోజకవర్గ పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
నియోజకవర్గంలో పలు రకాల పంటలకు సాగునీరు అందక ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయని వెంటనే పంటలకు సరిపడా నీళ్లు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గతంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న మిర్చి, ఇతర పంటలకు నష్టపరిహారం కింద రూ.25 వేలు చెల్లించాలని,వరి, మొక్కజొన్న పంటలతో పాటు ఇతర పంటలకు ఎన్నికలలో ఒప్పుకున్న ప్రకారం క్వింటాల్ కు రూ.500 బోనస్ అదనంగా చెల్లించాలని ఎన్నికల సమయంలోకాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల మేరకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి రైతు బీమా, రైతుబంధు, కౌలు రైతును ఆదుకోవడం ,వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని అర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద 9 గంటలకు రైతు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కావున మండలంలోని రైతులు, ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని అనుబంధ సంఘాల పార్టీ శ్రేణులు పాల్గొని నిరసన దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సారంగపాణి కోరారు. కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ చెట్టు పెళ్లి మురళీధర్ రావు, ఎంపీపీ ఊడుగులసునీత ప్రవీణ్ గౌడ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, పిఎసిఎస్ వైస్ చైర్మన్ తక్కలపల్లి మోహన్ రావు, క్లస్టర్ బాధ్యులు ఇంగ్లీశివాజీ, మామిండ్ల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version