వారణాసిలో ఎంపీ వద్దిరాజును కలిసిన అభిమానులు

Date 28/02/2024
—————————————-
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో అభిమానులు సత్కరించారు. రాజ్యసభకు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన రవిచంద్ర అధికార పర్యటనలో భాగంగా వారణాసికి వెళ్లారు.అక్కడ జరుగుతున్న పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశానికి రవిచంద్ర హాజరైన విషయం తెలిసిందే.ఈ సమాచారం
తెలుసుకున్న ఉత్తర ప్రదేశ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి విశ్వాస్ రావుతోపాటు మరో స్థానిక నాయకుడు రవిచంద్ర బస చేసిన హోటల్ కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రవిచంద్రకు కాశీ విశ్వేశ్వరుని ఫొటోను బహూకరించి, శాలువాతో సత్కరించారు.ఈ విధంగా ఎంపీ రవిచంద్ర పట్ల తనకున్న అభిమానాన్ని విశ్వాస్ రావు చాటుకున్నారు.
ప్రముఖ న్యాయవాది, బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు స్వామి రమేష్ కుమార్ ఖమ్మంలో పలుసార్లు నిర్వహించిన పోటీలకు హాజరైన విశ్వాస్ రావు ఎంపీ వద్దిరాజు మర్యాద,ఆప్యాయత,మంచితనాన్ని దగ్గరగా చూసి ఆయన పట్ల అభిమానాన్ని పెంచుకున్నారు. వారణాసిలో పర్యటిస్తున్నట్లు తెలుసుకుని ఆయన్ను కలుసుకుని సత్కరించడం  విశేషం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version