భూపాలపల్లి నేటిధాత్రి
బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు మంజు నగర్ లో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి హాజరైనారు వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వాజ్పేయి ఫోటో ఎగ్జిబిషన్ వీక్షించడం జరిగింది ఈ సందర్భంగా కీర్తి రెడ్డి మాట్లాడుతూ
రాజకీయ విలువలతో కూడిన గొప్ప నాయకులు, భావితరాలకు సువర్ణ బాటలు వేసిన దార్శనికులు,ఆధునిక భారత్ కు గట్టి పునాదులు వేసిన మహాత్ములు,తన ముందుచూపుతో దేశమంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో నేషనల్ హైవేస్ అభివృద్ధికి బాటలు వేసిన గొప్ప రాజకీయవేత్త భరతమాత సేవకై తన జీవితాన్ని త్యజించిన మహాకవి,తన ప్రసంగంతో ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసే గొప్ప వక్త,భరతమాత ముద్దుబిడ్డ,అజాతశత్రువు ఆదర్శ నేత,బిజెపి వ్యవస్థాపకులు,భారతరత్న మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి అని అన్నారు నేటి యువత అతన్ని ఆదర్శంగా తీసుకొని రాజకీయంలోకి రావాలని ఆమె అన్నారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రామచంద్రారెడ్డి కన్నం యుగంధర్ దళిత మోర్చా రాష్ట్ర నాయకులు బట్టు రవి పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పొలసాని తిరుపతి రావు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ అర్బన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి రేగొండ మండల అధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి నాయకులు నవీన్ రావు దేవేందర్ కొమురయ్య పూర్ణచందర్ ఎర్ర రాకేష్ రెడ్డి నేరెళ్ల శంకర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు