జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి గణపతి
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట కాన్కూర్ మిట్టపల్లి గ్రామపంచాయతీలను బుధవారం రోజున జిల్లా ప్రత్యేక అధికారి గణపతి సందర్శించారు. మూడు గ్రామపంచాయతీలలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పైపులైన్లను వాటర్ ట్యాంకులను అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక వైద్య కేంద్రాలను,గ్రామపంచాయతీ కార్యాలయాలను సందర్శించి రికార్డులను తనిఖీ చేసి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ గ్రామాలలో ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు తప్పకుండా నిర్వహించాలని, గ్రామాలను శుభ్రంగా ఉంచాలని, ఎక్కడ నీరు నిలువ లేకుండా చూసుకోవాలని, కాలువలలో, కుంటలలో, రోడ్ల వెంట, ఇంటి పరిసరాలలో క్లోరినేషన్ ప్రక్రియ నిర్వహించాలని, ఫాగింగ్ జరిపించాలని, దోమలు ఈగల నిర్మూలన చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రతినిత్యం జరిపించాలని, విష జ్వరాలు ప్రబలకుండా గ్రామస్థులకు అవగాహన కల్పించాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించాలని గ్రామపంచాయతీ కార్యదర్శులకు, వైద్య సిబ్బందికి తెలియజేశారు. అందరూ గ్రామపంచాయతీలను రక్షించేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులందరికీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి గణపతి, జైపూర్ ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, గ్రామ పంచాయతీల కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు,పారిశుద్ధ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.