మాదారి భాగ్య రెడ్డి వర్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి : మాదారి బాగ్యా రెడ్డి వర్మ ఆశయ సాధన కోసము ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు
భాగ్య రెడ్డి వర్మ 136 వ జయంతి ఉత్సవాలను బుధవారం ఐ.డి. ఒ.సి. ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం అధికారికంగా ఘనంగా నిర్వహించారు.
జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్, సంఘ నాయకులు భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదారి భాగయ్య దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని విద్య ద్వారానే దళితులు ఆత్మగౌరవం, అభివృద్ధి సాధించగలరనే విశ్వాసంతో హైదారాబాద్ లో దళితుల కొరకు 30 పాఠశాలలు ఏర్పాటు చేశారని చెప్పారు. హిందూ సమాజంలోని అస్పృశ్యత, అంటరానితనం పై అలుపెరుగని పోరాటం చేశారని తెలిపారు. సమాజంలో ఉన్న జోగిని, దేవదాసి, వెట్టిచాకిరి వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించి సమాజంలో మార్పు కొరకు కృషిచేశారని తెలిపారు. ఆది ఆంధ్ర సభ నిర్వహించి దళితులను, అణగారిన వర్గాల ప్రజలను చైతన్య పరిచేందుకు కృషి చేశారని గుర్తు చేశారు.
భాగ్యరెడ్డి వర్మ సూచించిన బాటలో పయనించిన జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు రాజారాం ప్రకాశ్ తన చక్కటి పాట ద్వారా భాగ్యరెడ్డి వర్మ జీవిత కథను వివరించారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి నుషిత, జిల్లా అధికారులు, సంఘము నాయకులు గంధం నాగరాజు, గిరిరాజా చారి, టి. వెంకటస్వామి కలెక్టరేట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version