ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ విద్యను అభ్యసించాలి

చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి

మందమర్రి, నేటిధాత్రి:-

ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆత్మరక్షణ విద్యను అభ్యసించాలని, ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరమని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. పట్టణంలోని సిఐఎస్ఎఫ్ బ్యారక్ లో మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) స్మారక 7వ సౌత్ ఇండియా లెవెల్ కరాటే పోటీల ప్రారంభానికి అయిన ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటి ప్రపంచంలో విద్యా తో పాటు క్రీడలు ఎంత అవసరమని తెలిపారు. ఈ పోటీలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version