ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి.

# జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్. పి.ప్రావీణ్య
# జిల్లాలో మొత్తం 7,33,454 మంది ఓటర్లు..
# ఎన్నికల ఉల్లంఘన ఫిర్యాదుల కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..

# టోల్ ఫ్రీ నంబర్ 1950, 0870 2530811, వాట్స్ అప్ నెం. 9154252936.

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :

జిల్లాలో అసంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించుటకుఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించుటకు అందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్. పి.ప్రావీణ్య పేర్కొన్నారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రకటన విలువరించిన దృష్ట్యా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారని 10వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చునని 13న స్క్రోటి ని జరుగుతుందని ,15న నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చని తెలిపారు. నవంబర్ 30న ఎన్నికలు జరుగు తాయని,డిసెంబర్ 3న ఫలితాలు వెలువడడంతో డిసెంబర్ 5న ఎన్నికలు సమాప్తం అవుతాయని అన్నారు.వరంగల్ జిల్లాలోని 103 -నర్సంపేట, 106 వరంగల్ తూర్పు, 107వర్ధన్నపేట నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు.
జిల్లాలో మొత్తం 7,33,454 మంది ఓటర్లు కాగా మహిళలు 3,72,181, పురుషులు 3,60,915 మంది , 18-19 యువ ఓటర్లు 18,541 మంది ఉన్నాయన్నారు. పి డబ్ల్యు డి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసామని,జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. అభ్యర్థులు ముందుగా ప్రకటనలు ఇస్తే ఎంసిఎంసి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఓటర్లు ముందస్తుగా వారి ఓటును ఆన్ లైన్ లో చెక్ చేసుకోవాలని, ఓటును ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా వారికి ఇష్టం వచ్చినవారికి ఓటు వేయాలని సూచించారు. జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరుగకుండా సజావుగా నిర్వహించించేందుకు సహకరించాలని కోరారు.

# ఫిర్యాదుల కొరకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు..

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన ఫిర్యాదుల కొరకు కలెక్టర్ కార్యాలయంలో
కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1950, 0870 2530811, వాట్స్ అప్ నెం. 9154252936
ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎన్నికల సంఘం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని అన్నారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈరోజు నుంచి అమల్లోకి వస్తుందని 24 గంటలు, 48, 72 గంటల్లో
పాఠశాలలో విద్యాలయ సంస్థలపై
ప్రైవేట్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్స్ షాపింగ్ మాల్స్ లలో
ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు బ్యానర్లు పోస్టర్లు పెయింటింగ్ తొలగించుటకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

# ఎన్నికల రిటర్నింగ్ అధికారుల పేర్లు ఖరారు..

నర్సంపేట నియోజకవరర్గానికి ఆర్డీవో కృష్ణవేణి, వరంగల్ తూర్పుకు జి డబ్ల్యుఎంసి కమిషనర్ రిజ్వానా భాష షేక్, వర్ధన్నపేట నియోజకవర్గానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని వాకాడే రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్. పి.ప్రావీణ్య అన్నారు.

# ఎన్నికలలో మోసాల పట్ల సి-విజిల్ మొబైల్ యాప్‌ ఏర్పాటు..

ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు, మోసాలు జరగకుండా సి-విజిల్ మొబైల్ యాప్‌ను వినియోగిస్తున్నట్లుగా కలెక్టర్ ప్రకటించారు. ఈ ఫ్రీ యాప్ అన్ని రకాల ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడొచ్చని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఏవైనా ఉల్లంఘనలు జరుగుతున్నా, అవకతవకలు జరిగినా ఈ సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. వెంటనే ఎన్నికల సంఘం ఫిర్యాదు అందిన 100  నిమిషాల్లోపు స్పందిస్తుందని కలెక్టర్ చెప్పారు.

సి-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల్లో జరిగే అక్రమాల గురించి ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడడం, అభ్యర్థుల దుష్ర్పవర్తన, ఎన్నికల అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి వాటిని పౌరులు గుర్తించినట్లయితే, వెంటనే సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అప్పటికప్పుడే తప్పునకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు యాప్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ఫిర్యాదును నమోదు చేయవచ్చని, ఎలాంటి గుర్తింపు లేకుండా అనామక వ్యక్తిగా కూడా ఈ యాప్‌లోకి లాగిన్ అవ్వచ్చని అన్నారు.

# ఎన్నికల్లో మీడియాదే కీలక పాత్ర…

ఎన్నికల్లో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ అన్నారు.
కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ (MCMC. ) ఏర్పాటు చేయడం జరిగిందని, రాజకీయ ప్రకటనలు సంబంధిత ఎంసిఎంసి నుండి ముందస్తు ధృవీకరణ పొందిన తదుపరి పబ్లిషింగ్, టెలికాస్ట్ చేయాలన్నారు.ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణకు కూడా ఎంసిఎంసి నుండి ముందస్తు ధృవీకరణ పొందాలన్నారు.

# సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు..

సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి నిత్యం పరిశీలిస్తున్నట్లు
దుర్వినియోగం ఉల్లఘించిన వారి పట్ల నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో జి డబ్ల్యుఎంసి కమిషనర్ రోలు షేక్ రిజ్వాన్ బాషా,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డిఓ వాసు చంద్ర , డిపిఆర్ ఓ అయ్యుబ్ అలీ కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version