జైపూర్,నేటి ధాత్రి:
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జులై 9 ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెన్నూరు పట్టణంలోని శిశుమందిర్ పాఠశాలలో అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు కలిపి మండల స్థాయి వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తగా రత్న లక్ష్మీనారాయణ వ్యవహరించగా పోటీని నిర్ణయించే న్యాయ నిర్ణీతలుగా బొడ్డు మహేందర్, జగన్మోహిని ,పద్మజ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కరీంనగర్ విభాగ్ కళామంచ్ కన్వీనర్ మామిడి అక్షిత మాట్లాడుతు విద్యార్థుల ప్రతిభను ముందుకు తీసుకురావడానికి ఏబీవీపీ ముందు ఉంటుంది అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో ఉన్న కళని గుర్తింప చేస్తాయని, ప్రోత్సాహాన్ని ఇస్తాయని అన్నారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రథమ,ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు.ఉపన్యాస పోటీల్లో స్థానిక రైసింగ్ సన్ స్కూల్ నుంచి హాసినికి, వ్యాసరచన పోటీల్లో శిశుమందిర్ పాఠశాల నుంచి శ్రీవిద్య కి మొదటి బహుమతి రావడం జరిగింది.కార్యక్రమంలో ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి దాండ్ల సతీష్, కార్యకర్తలు మోసెస్, శివ, సాగర్ , శ్రవణ్ ,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.