జమ్మికుంట :నేటి ధాత్రి
హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే ఒక అబద్దాన్ని నిజం చేద్దామని అనుకొని హుజురాబాద్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్తున్న ఎన్ టి పి సి బూడిద లారీలను ఆపి ఇవి అధిక లోడుతో వెళ్తున్నాయని కావాలని ఆపి మన మంత్రి పొన్నం ప్రభాకర్ పై తప్పుడు ప్రచారం చేస్తూ అవగాహన లేని,అనవసరపు,చిల్లర మాటలు మాట్లాడుతున్న సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహమ్మద్ సజ్జు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రాసపల్లి రమేష్, దొగ్గల భాస్కర్, మాదారపు లింగారావు, శ్రీనివాస్ రవీందర్ రెడ్డి, కడిపికొండ తిరుపతిరెడ్డి, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు