అధికారులను నిలదీసిన గుడితండా గ్రామప్రజలు
కారేపల్లి నేటి ధాత్రి
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాణిక్యారం గ్రామం.గుడితండా లో మెషిన్ భగీరథ నీళ్లు గత 20 రోజుల నుంచి గ్రామం లోని ఇండ్ల ల్లోకి రావటం లేదని నీళ్లు రాకపోవడంతో గ్రామాల్లో ప్రజలు అనెక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని. గ్రామప్రజలు ఆందోళనకు దిగగా
విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడకు చేరుకొని మాణిక్యారం గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎ ఈ నరేందర్ కి ఫోన్ ద్వారా అక్కడ జరిగిన సమాచారాన్ని తెలియపరచగ అదికారులు గుడి తండా కు రాగ అక్కడ ప్రజలు మంచినీటి సమస్యలు పరిష్కారం చెయ్యాలని అధికారులను నిలదీసి సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని అధికారులకు తెలిపారు ప్రజల సమస్యలు విన్న అధికారులు 24 గంటల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో మాణి క్యారం మాజీ సర్పంచ్ భూక్యా రంగారావు ధరావత్ వికాస్ భూక్యా పాప భూక్యా సురేష్ అజ్మీర సంజీవ్ వర్మ భూక్యా శ్రీనివాస్ అజ్మీరా శ్రీనివాస్ భూక్యా వచ్చాయా భూక్యా పిచ్చయ భూక్యా శోభన్ భూక్యా జిందా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.