జిల్లా అధ్యక్షులు ఆదేశాల తో
-నర్సంపేట డివిజన్ అధ్యక్షులు జనగం ప్రవీణ్ కుమార్
ప్రధాన కార్యదర్శి గా బడిశా కుమారస్వామి
ఖానాపూర్ నేటిధాత్రి
నర్సంపేట డివిజన్ నేతకానీ కుల సంఘము ప్రధాన కార్యదర్శి గా నల్లబెల్లి మండలం రాంతీర్థం కు చెందిన బడిశా కుమార్స్వామి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు జిమ్మిడి వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు నర్సంపేట డివిజన్ అధ్యక్షులు జనగం ప్రవీణ్ కుమార్ వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా బడిశా కుమార్స్వామి మాట్లాడుతూ నేతకానీ కులస్తులు నర్సంపేట డివిజన్ లోనే ఖానాపూర్ మండలలోని అశోక్ నగర్,నల్లబెల్లి మండలం లోని రాంతిర్థం, మరియు నర్సంపేట లోనే నేతకానీలు ఉన్నారాని అన్నారు,నేతకానీ కుల సంఘము అభివృద్ధి కి నావంతు కృషి చేస్తానని వారు తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులకు, డివిజన్ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జనగం ప్రవీణ్ కుమార్, తదితరులు ఉన్నారు.