ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.

అచ్చునూరి కిషన్
ములుగు జిల్లా ఇంఛార్జీ.

ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కిషన్ అధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులను, సిబ్బంది’ని ఓటు అభ్యర్థిస్తూ మాట్లాడుతూ….. ఈ నెల 27 నా జరిగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వామపక్ష పార్టీలు, తెలంగాణ జన సమితి, న్యూడెమోక్రసీ, PRTU తెలంగాణ, STUTS, మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (GTA) ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల మద్దతుతో మీ ముందుకు వస్తున్నా ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న’కు మొదటి (1)ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించగలరని ప్రతి ఒక్కరిని పేరుపేరున వేడుకుంటున్నాను.

తీన్మార్ మల్లన్న వ్యక్తి కాదు ఒక మహా శక్తి, పోరాట యోధుడు, సామాన్య ప్రజలకు ఏలాంటి ఆపద వచ్చినా అనునిత్యం అండగా నిలిచే మానవతా వాది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాల’పై అలుపేరుగని పోరాటం చేసి వంద రోజులు జైలు జీవితం గడిపిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో అవిశ్రాంతంగా పోరాటం చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న’నే అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.!
అనేక మంది పేద ప్రజలకు ఆసరా గా ఉంటు వరదల సమయంలో ముంపు ప్రాంతాల ప్రజలకు, కరోనా కష్ట కాలంలో తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్న వారి బాధను చూసి చలించి వారి కి నేనున్నాను అనే మనోధైర్యాన్ని ఇచ్చి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహించినా వ్యక్తి తీన్మార్ మల్లన్న.

ఉద్యోగుల పై ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన 317 జీవో ను రద్దు చేయాలని ఆమరణ దీక్ష చేసి వారి పక్షాణ నిలబడి పోరాటం చేసిన వ్యక్తి మల్లన్న, అలాగే గత బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 46 నిరుద్యోగుల మధ్య వేర్పాటువాదన్ని సృష్టించి నిరుద్యోగ యువతను అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేసింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం.

కావున ఇప్పుడు ఉన్న ప్రజా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల సాధనకై సానుకూలమైన వైఖరి’తో ఉంది కాబట్టి విద్యావంతులైన మీరందరూ ఒకసారి ఆలోచించి మీ తరుపున నిలబడి, కలబడే ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న’కే మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి పెద్దల సభకు పంపాలని కోరుతున్నాను.

ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్, యూత్ కాంగ్రెస్ పార్టీ ములుగు మండల అధ్యక్షుడు కుక్కల నాగరాజు, మధు, కోటి, అశోక్, శ్రావణ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version