వేడుకలు ఘనంగా జరిగాయి: జగదీశ్వర్ గౌడ్
కూకట్పల్లి,ఫిబ్రవరి 28 నేటి ధాత్రి ఇన్చార్జి
విజయ గణపతి దేవాలయ సేవా సమితి ప్రశాంత్ నగర్ లో సోమవా రం నుండి బుధవారం వరకు అష్ట మ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవముగా జరిగాయి. విజయ గణపతి దేవాలయ సేవా సమితి సభ్యులు కావూరి ప్రసాద్, కొఠారి వెంకట్, వేమూరి సాంబశివరావు వీరి నేతృత్వంలో ముఖ్య అతిథిగా శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ వారిని ఆహ్వానించా రు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగదీశ్వర్ గౌడ్ మాట్లాడు
తూ…. శ్రీ విజయ గణపతి దేవాల య సేవ సమితి ప్రశాంత్ నగర్ లో బుధవారం నిర్వహించిన అష్టమ వార్షికోత్సవ వేడుకలు ఈ ప్రాంతం వాసుల మనసులను ఎంతో పులకిం ప చేసిందని తెలిపారు.అన్ని దేవు
ళ్ళ కంటే ప్రథమంగా పూజలందు కునే శ్రీ విజయ గణపతి భక్తులకు కోరిన కోరికలను తీర్చాలని ఆయు రారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో ఎల్ల ప్పుడూ సుఖంగా జీవించాలని జగదీశ్వర్ గౌడ్ కోరారు.వేడు కలనుపుర స్కరించుకొని ఆలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వ హించగా,కార్య క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్,కృష్ణ, సంజీవ్ రెడ్ది,వేదమూర్తి, రాజేంద్రప్రసాద్లు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో గౌతమీనగర్ కాలనీ ముఖ్య సలహాదారులు పరుచూరి గణేష్ బాబు తదితరులు పాల్గొన్నా రు.