కుష్టురహిత సమాజ స్థాపనకు కృషి చేయాలి

గ్రామసర్పంచ్ కందగట్ల రవి

శాయంపేట నేటిధాత్రి :

శాయంపేట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ76 వర్ధంతిని పురస్కరించుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముందుగా పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సాయికృష్ణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయికృష్ణ మాట్లాడుతూ బ్యాక్టీరియా వలన కుష్టి వ్యాధి వస్తుందని, చర్మానికి, నరాలకు ఈ వ్యాధి సోకుతుందన్నారు. వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి 3 నుండి 5 ఏళ్ల కాలం పడుతుందని, దీనికి లింగ బేధం, వయస్సుతో సంబంధం లేదన్నారు. వంశపారంపర్యంగా సంభవించే వ్యాధి కాదన్నారు. ఈ వ్యాధిని ఎం డి టి చికిత్సతో 6 నెలల నుండి 12 నెలల్లో పూర్తిగా నయం చేసుకోవచ్చ న్నారు. చర్మంపై ఏ రకమైన మచ్చలు ఉన్న సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని, కుష్టు వ్యాధి పట్ల ఉన్న భయాన్ని విడనాడాలని డాక్టర్ సాయికృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత సొసైటీ మాజీ కార్యదర్శి మామిడి అశోక్, పంచాయతీ కార్యదర్శి మడికొండ రత్నాకర్, లైన్ ఇన్స్పెక్టర్ దామోదర్, నాయకులు బూర కుమారస్వామి, ధైనంపల్లి బాబు, వైద్య సిబ్బంది వెంకటేశ్వర వర్మ, చలపతి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version