శాయంపేట నేటిదాత్రి:
శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం క్రాస్ రోడ్ వద్ద రానున్న ఎన్నికల దృష్ట్యా మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో శాయంపేట ఎస్సై డి. దేవేందర్, పోలీస్ సిబ్బంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (ఆర్మీ )బలగాలతో ఆకస్మిక వాహన తనిఖీలు చేస్తుండగా భూపతి .సుధాకర్ అనే వ్యక్తి వరంగల్ అతని కారు హనుమకొండ నుండి పరకాల వైపు వెళుతుండగా తనను ఆపి కారు చెక్ చేయగా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎలాంటి పత్రాలు లేకుండా నగదు 1,00,000/- అక్షరాల లక్ష రూపాయలు నగదు తీసుకొని వెళుతుండగా డబ్బులను సీజ్ చేసి భూపాలపల్లి రిటర్నింగ్ ఆఫీసర్ అధికారికి అప్పగించనైనది.