విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణ బహుజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు చంటి ముదిరాజ్

పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారించాలని తెలంగాణ బహుజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు చంటి ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్ని రంగాల్లో విద్యారంగం వెనుకబడి ఉందని ఈ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.గతంలోనే నిర్ణయం తీసుకున్నా నిర్ణయాలలో కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగులో ఉన్నాయని ప్రధానంగా రాష్ట్రంలో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాలు,గురుకులాలు, కెజిబివి లు,ఆశ్రమ పాఠశాలలు,కళాశాల వసతిగృహాలకు మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయని అన్నారు.ఎస్టీ డిపార్ట్మెంట్ కళాశాల వసతి గృహాలకు జూన్ నుండి ఎస్సీ డిపార్ట్మెంట్ లో సెప్టెంబర్ నుండి మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయని గత ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలకు ఇప్పటికీ ఇవ్వలేదని 2018 నాటి ధరలకనుగుణంగా ఇంకా పాత మెనూ అమలు అవుతుందన్నారు.ప్రభుత్వం ఎస్సీ,బిసి హాస్టల్స్ కు ఇస్తున్న కాస్మోటిక్ ఛార్జీలు విద్యార్థులకు 65 రుపాయాలు,విద్యార్ధినీలకు 100రూపాయలు సరిపోవడం లేదన్నారు.అద్దె భవనల్లో నడుస్తున్న గురుకులాలు,హాస్టల్స్, కెజిబివిలకు స్వంత భవనాలు నిర్మించాలన్నారు. రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుండి 7,200 కోట్లకు పైగా స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్స్ పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా విడుదల చేయాలన్నారు.ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించాలని,యూనివర్శీటీల మెస్ బకాయిలు కూడా ఉన్నాయని వాటిని కూడా తక్షణమే విడుదల చేయాలని కోరారు.పెరిగిన ధరలకు అనుగుణంగా వసతిగృహాలకు, గురుకులాలకు,రెజిబివిలకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని,రాష్ట్రంలో పెండింగ్ ఉన్న మెస్,కాస్మోటిక్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలని,హస్టల్స్ రీపేరు భాధ్యత గురుకులాల తరహాలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు ఇచ్చి అన్నింటీని రిపేరు చేయించాలని,ప్రస్తుతం ధరలకు అనుగుణంగా అమలు జరిపేలా నిధులు ఇచ్చి ప్రీ మెట్రిక్
విద్యార్థులకు నెలకు రూ. 2000/- పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు రూ. 4000/- వృతి విద్యా, యూనివర్శీటీల విద్యార్థులకు నెలకు రూ.5000/- అందించాలని, పెండింగ్లో ఉన్న 7200 కోట్ల స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ తక్షణమే విడుదల చేయాలని,ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయాలని,అద్దె భవనాల్లో నడుస్తున్న అన్ని గురుకుల కెజీబీవీ లకు స్వంత హాస్టళ్లు నిర్మించాలని,తెలంగాణ అన్ని జిల్లాలలో ప్రభుత్వ యూనివర్సిటీ,లా కాలేజి, ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని తెలంగాణ బహుజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు చంటి ముదిరాజ్ డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version