నిజాంపేట, నేటి ధాత్రి
లీలా గ్రూప్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మోహన్ నాయక్ శుక్రవారం మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును కలిసి రామాయంపేట లో నిర్వహించే నల్ల పోచమ్మ బోనాలు ద్వితీయ వార్షికోత్సవానికి రావాలని ఆహ్వానించడం జరిగింది. ఈనెల 16న తన క్షేత్రంలో గల నల్ల పోచమ్మ బోనాల పండుగ చేయడం జరుగుతుందని అందుకు మైనంపల్లి హనుమంతరావు తప్పకుండా హాజరవుతారని తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ తాండ మాలోతు నరేష్ తదితరులు పాల్గొన్నారు.