డా.మల్లురవి ని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలి.

టీపీసీసీ కో ఆర్డినేటర్
దారా భాస్కర్.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

అన్ని వర్గాల ప్రజల కు అండగా ఉండే డాక్టర్. మల్లురవి ని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని పోమాల గ్రామానికి చెందిన టిపిసిసి కోఆర్డినేటర్ దారా భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, కాంగ్రేస్ పార్టీ సిద్ధాంతాలే శిరోధార్యంగా, సమాజం పట్ల సంపూర్ణ అవగాహనతో, కుల మత బేధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు రాజకీయంగా , సామాజికంగా , ఆర్థికంగా ఎదగాలని కోరుకొనే వ్యక్తి, డాక్టర్. మల్లు రవి అని కాంగ్రేస్ పార్టీతోనే సమాజానికి మేలు జరుగుతుంది అని నమ్మిన వ్యక్తి ముఖ్యoగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా మాదిగలకు రాజకీయంగా అండగా ఉండే డా. మల్లు రవి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లుగా ఉన్నా. ఏకైక సామజిక వర్గం మాదిగలు. తెలంగాణ రాష్ట్రలో రాబోయే ఎంపీ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు గెలిపించే విదంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు & టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కోరికను నెరవేర్చడంతో పాటు , తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా తల్లి సోనియమ్మ రుణాన్ని తీర్చుకునే బాధ్యత మాన అందరిపైన ఉంది అని టీపీసీసీ కో ఆర్డినేటర్
దారా భాస్కర్ అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version