తెలంగాణ ఉద్యమ చరిత్రపై డాక్యుమెంటరీ: మధుయాష్కీ గౌడ్.

మధుయాష్కీ గౌడ్ నివాసంలో కాంగ్రెస్ పెద్దల కీలక భేటి.

పార్లమెంటులో కాంగ్రెస్ ఆనాటి ఎంపిల పోరాటం నేపథ్యంగా డాక్యుమెంటరీ.

ఎంపిగా వున్న సమయంలో ఎమ్మెల్సీ విజయశాంతి పోరాటం కూడా డాక్యుమెంటరీలో పొందుపర్చడం జరుగుతుంది.

తెలంగాణ ఉద్యమ పోరాట చరిత్రపై డాక్యుమెంటరీ రూపొంచనున్నట్లు
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ప్రకటించారు. ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ పెద్దల జానారెడ్డి , మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , కే కేశవరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్సీ విజయశాంతితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎన్ని పోరాటాలు జరిగినా పార్లమెంట్ లో బిల్లు పాస్ కావడం ఎంతో కీలకపరిణామమని అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు. ఆ ఆర్టికల్ ను రూపొందించిందే కాంగ్రెస్ పార్టీ అని మధు యాష్కీ పేర్కొన్నారు. మధుయాష్కీ నివాసంలో జరిగిన సమావేశంలో నాయకులకు డాక్యుమెంటరీ వివరాలు తెలియజేశారు.‌ ఈ డాక్యుమెంటరీలో కాంగ్రెస్ నాయకులు, ఎంపీలుగా ఆ సమయంలో తాము చేసిన పోరాటాన్ని తెలంగాణ సమాజానికి గుర్తు చేసేలా డాక్యుమెంటరీ వుంటుందని యాష్కీ గౌడ్ చెప్పారు. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు ఎంపిగా వున్న ప్రస్తుత ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన పోరాటం కూడా డాక్యుమెంటరీలో పొందుపర్చడం జరుగుతుందన్నారు. కేసిఆర్ కన్నా పార్లమెంటులో ఎక్కువగా విజయశాంతి పోరాటం చేసిందని మధుయాష్కీ గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!