అభినందించిన ప్రభుత్వ కళాశాల సిబ్బంది
పరకాల నేటిధాత్రి
రసాయన శాస్త్ర ప్రొఫెసర్ శివరాజ్ పర్యవేక్షణలో కాంప్రహెన్సీవ్ ఇన్విస్టిగేషన్ ఆఫ్ మోనోన్యూక్లియర్ కోబాల్ట్,నికెల్,కాపర్,మెతాక్షి బెంజనామైన్,సింథసిస్ క్యారెక్టర్జేషన్,జియోమెట్రికల్ ఆప్తమైజేషన్,డిఎన్ఏ ఇంటరాక్షన్ అడ్మిట్ మరియు ఇన్విట్రో బయోలాజికల్ అనలైసిస్ అనే అంశాల మీద పరిశోధన చేసినందుకుగాను పరకాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర కే.జగదీష్ బాబుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేస్తున్నట్టు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది.జగదీష్ బాబుకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.సంతోష్ కుమార్,రసాయన శాస్త్ర విభాగం నుండి డాక్టర్. అశోక్,అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్.మల్లయ్య,ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్.రామకృష్ణ, స్టాఫ్ సెక్రటరీ డాక్టర్.విజయపాల్ రెడ్డి, అధ్యాపకులు,కళాశాల సిబ్బంది అభినందనలు తెలియజేశారు.