♨️
సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో, రోలింగ్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా, వరంగల్-ఆదిలాబాద్, తిరుపతి వెళ్లు కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలును ఈనెల 28 నుంచి, మే 22 వరకు వరంగల్ రాకుండా దారి మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రైళ్ల దారి మళ్లింపులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు చేయాలని ప్రయాణికులను కోరారు.