కొల్చారం (మెదక్)నేటిధాత్రి :-
సోమవారం నుండి ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాధికారి రాధా కిషన్, మండల విద్యాధికారి నీలకంఠం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొల్చారం, ప్రాథమిక పాఠశాల కొల్చారం, లేక్ వ్యూ ప్రైవేట్ పాఠశాల కొల్చారం, సీతారాం తండా, రంగంపేట ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు.
తరగతి గదులను సందర్శించి పరీక్షల నిర్వహణ పరిశీలించడం జరిగింది, విద్యార్థుల హాజరు గురించి ఉపాధ్యాయులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రాధా కిషన్, ఎంఈఓ నీలకంతం మాట్లాడుతూ
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.