భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు స్థానిక నన్నపనేని మోహన్ హైస్కూల్ నందు రోటరీ క్లబ్ ఆఫ్ కోకాపేట్ ఏకం మరియు రోటరీ క్లబ్ భద్రాచలం సంయుక్తంగా నూజివీడు సీడ్స్ వారి ఆర్థిక సౌజన్యంతో స్కూలు విద్యార్థులకు సుమారు 2,50,000/- విలువచేసే స్కూల్ బెంచీలను అందించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ముఖ్యఅతిథిగా హాజరవడం జరిగింది వితిష్ట అతిథిగా ఎంఈఓ రమాదేవి స్కూల్ హెడ్మాస్టర్ పులిపాటి రామకృష్ణ అదేవిధంగా నూజివీడు సీడ్స్ సేల్స్ హెడ్ కృష్ణ కిలారు హాజరయ్యారు.
రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం అధ్యక్షుడు దార బాలాజీ మాట్లాడుతూ భద్రాచలం రోటరీ క్లబ్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ కోకపేట్ ఏకం వారు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేయటం జరిగింది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విద్యాసాగర్, కోశాధికారి శ్రీనివాస్, పూర్వ అధ్యక్షులు ప్రభాకర్ గుప్త ,రఫీ, మధుసూదన్ రావు, నాగేశ్వర రావు ,వీరయ్య, చైతన్య రెడ్డి ,వైస్ ప్రెసిడెంట్ అజీమ్, సబ్యులు చలపతి, శ్రీధర్ రెడ్డి,, బందు నరసింహ రావు, ఎల్. వెంకటేశ్వర్లు, రామకృష్ణ ,
ఇన్నర్ విల్ సభ్యులు దారా నలిని నూకల రజని అదేవిధంగా స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.