ఓదెల (పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన కోర్రి లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబానికి నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి 50కిలోల బియ్యాన్ని వితరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో,నల్ల సోషల్ మీడియా కోఆర్డినేటర్ జీల రాజేందర్,నల్ల ఫౌండేషన్ సభ్యులు కోర్రి రాములు,కోర్రి శ్రీను, అంబాలా రాజు, బండారి శెంకర్,రాజేందర్,శ్రీను, శారదా,యువత తదితరులు పాల్గొన్నారు