మాధవ స్మారక సమితి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, పెన్స్ పంపిణీ.

మాధవ స్మారక సమితి, వరంగల్ ఆధ్వర్యంలో హనుమకొండ లష్కర్ బజార్ లోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, పౌచులు బహుకరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో జిల్లాలో ప్రథమ స్థాయిలో నిలిచిన బి.వైశాలి అనే విద్యార్థినికి 5001/- రూపాయి నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.జగన్, స్టాఫ్ సెక్రటరీ గుజ్జ వెంకటేశం, మాధవ స్మారక సమితి ప్రతినిధులు డాక్టర్ సుధాకర్ రావు, అలువాల బిక్షపతి, దాస్యం రామానుజం, పోల్సాని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి మల్లారెడ్డి, లెక్కల జలంధర్ రెడ్డి, రాచకట్ల లక్ష్మణ్ సుధాకర్, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version