పేదలకు నిత్యవసరకులు పంపిణీ

మందమర్రి, నేటిధాత్రి:-

పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని ఊరు మందమర్రి గ్రామంలో మా ఊరు సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యవసరకు పంపిణీ చేశారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎండి ఇబ్రహీం, అధ్యక్షులు పెద్ది రాజన్న ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి టిపిసిసి సభ్యుడు నూకల రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, 20 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా నూకల రమేష్ మాట్లాడుతూ, ప్రతి నెల మా ఊరు సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు సేవ చేయడం అభినందనీయమని, ఇటువంటి సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. అనంతరం ఇబ్రహీం, రాజన్న లు మాట్లాడుతూ, ప్రతి నెల మా ఊరు సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలను గుర్తించి, వారికి సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. నేటి కార్యక్రమానికి సహకరించిన మంచిర్యాల నక్షత్ర జువెల్లర్స్ యాజమాని జైన నవీన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎవరైనా సరే దాతలు ముందుకు వచ్చి, సంఘం ఆధ్వర్యంలో పేదవారికి సహాయం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అటవీశాఖ అధికారి కనుకుంట్ల మల్లయ్య, సంఘం సభ్యులు పెద్ది లక్ష్మణ్, ఎండీ ముజాహిద్, పాలమాకుల భీంసేన్, రేగుళ్ల మల్లేష్, పల్లె అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version