నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన కొండి రాజయ్య గత ముప్పై సంవత్సరాలుగా గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ తన జీవితాన్ని గ్రామ ప్రజల కోసం అంకితం చేశారు. గతకొన్ని రోజులుగా రాజయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే మృతి చెందారు. దళిత నిరుపేద కుటుంబానికి చెందిన రాజయ్య మరణంతో అతని భార్య దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు గంగాధర మండల కేంద్రానికి చెందిన మహాలక్ష్మి సూపర్ మార్కెట్ యజమాని శ్రీరామ్ మల్లారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మల్లారెడ్డి బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా ఇరవై ఐదు కిలోల బియ్యం అందజేయడం జరిగింది. దీనిలో భాగముగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో బాదిత కుటుంబ సభ్యులకు బియ్యంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు నిత్యవసర సరుకులను కూడా పంపిణీ చేశారు. సేవాసంస్థ సభ్యులు ముదుగంటి మధుకర్ రెడ్డి తన వంతుగా ఒకవెయ్యి రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. ఈసందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ దాతలు ఇంకా ఎవరైనా బాధిత మహిళకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో సేవాసంస్థ అధ్యక్షులు దాసరి కనుకయ్య, ప్రధాన కార్యదర్శి దాసరి రవిశాస్త్రి, గౌరవ అధ్యక్షులు ఓద్దుల హన్మంత రెడ్డి, ఉపాధ్యక్షులు మేక సాయికుమార్, జాయింట్ సెక్రెటరీ వడ్లూరి సిద్దు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లేశం, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఆరెల్లి రాజశేఖర్, ముంజ శేఖర్ గౌడ్, ఈరెల్లి శశికుమార్, కత్తెరపాక నర్సయ్య, దాసరి మోహిత్, దాసరి ప్రశాంత్, దాసరి రాకేష్, ఈరెల్లి నర్సయ్య, దాసరి చంద్రయ్య, గంగాధర శ్రీకాంత్, కాసారపు పరుశురాం గౌడ్, బుర్ర శ్రీకాంత్ గౌడ్, గడ్డం రత్నాకర్, కళ్లెం అనిల్, మహేష్, తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version