దివంగత నేత నైనకంటి రంగారెడ్డి స్మారకార్థం డిక్షనరీల పంపిణీ

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 5

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్ల గ్రామానికి చెందిన దివంగత నేత..కీర్తిశేషులు నైనకంటి రంగారెడ్డి స్మారకార్థం ఆయన తనయుడు..పిడిసిల్ల గ్రామ సర్పంచ్ నైనకంటి ప్రభాకర్ రెడ్డి మండలానికి చెందిన పిడిసిల్ల, మొట్లపల్లి గ్రామాలలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు, పర్లపల్లి గ్రామంలోని శ్రీ శ్రీనివాసా చదువులాలయం ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు డిక్షనరీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నైనకంటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదువుకొని పుట్టిన ఊరికి..కన్న తల్లిదండ్రులకు..విద్యను నేర్పిన గురువులకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాదం సురేష్, ఉపాధ్యాయులు సాజిత్, శ్రీనివాస్, రవీందర్, రాజమౌళి, నరసింహాస్వామి, సంపత్ కుమార్, శ్రీధర్, స్వామి, రవి ప్రసాద్, శ్రీనివాస్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version