చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బుధవారం దాత బ్యాండ్ మేళాలు వితరణ చేశారు.
ఎన్గల్ గ్రామానికి చెందిన పసుల ప్రణయ్ తండ్రి కీర్తిశేషులు రామస్వామి జ్ఞాపకార్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రెండు బ్యాండులు కొనిచ్చి అందించారు. జరగనున్న గణతంత్ర్య దినోత్సవ వేడుకలకు విద్యార్థిని విద్యార్థులకు బ్యాండ్ మేళాలు అందించారు. ప్రభుత్వ పాఠశాలకు బ్యాండ్ మేళాలు అందించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.