కలెక్టరేట్ ముందు ధర్నా జయప్రదం చేయండి.

దళిత హక్కుల పోరాట సమితి.

వరంగల్ తూర్పు నేటిధాత్రి.

దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయం తమ్మెర భవన్ లో జిల్లా అధ్యక్షులు సంఘీ ఏలేందర్, ప్రధాన కార్యదర్శి జన్ను రవి దళితుల సమావేశం నిర్వంచారు.ఈనెల 23 న వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దళితుల కోసం ప్రభుత్వాన్ని పలు డిమాండ్ లు చేయడం జరిగింది.
⏩దేశవ్యాప్తంగా ఎస్ సి సబ్ ప్లాన్ చట్టం అమలతో పాటు మరియు రాష్ట్ర అసెంబ్లీలో జనాభా ఆధారంగా బడ్జెట్ ను కేటాయింపు చేయాలి.
⏩ప్రైవేటు రంగాల్లో దళితులకు రిజర్వేషన్ అమలు చేయాలి.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం నిలిపివేయాలి.
⏩ఎస్సీ ఇండస్ట్రీ సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేయాలి.
⏩ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు సబ్సిడీ నిధులను విడుదల చేయాలి. ⏩నూతనంగా ఎస్సీ కార్పొరేషన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి.
⏩ దళితులపై దౌర్జన్యాలు మరియు అంటరానితనాన్ని తక్షణమే నిలిపివేయాలి.
⏩భారత రాజ్యాంగం ప్రకారం దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను కల్పించాలి.
⏩దళితులకు విద్యా హక్కు, భూమి హక్కు మరియు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
⏩సాధారణ జనాభాగణతో పాటు సామాజిక,ఆర్థిక కులగణన నిర్వహించాల ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేశారు. ఈ డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రతి జిల్లాలో కలెక్టరేట్ ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుందనీ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version