సమ్మక్క సారలమ్మ లకు మొక్కులు సమర్పణ
నేడు అమ్మవార్ల వనప్రవేశం
మందమర్రి, నేటిధాత్రి:-
ఏరియాలోని ఆర్కే 1ఏ గని పై సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవార్లకు మొక్కలు సమర్పించేందుకు ఉదయం నుండే భక్తులు బారులు తీరారు. పట్టణం, రామకృష్ణాపూర్, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సింగరేణి ఏరియా యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో సమ్మక్క, సారలమ్మ పూజారి దూలం కనకయ్య గౌడ్, సింగరేణి అధికారులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.