16 అక్టోబర్ 2024
జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి
అధ్యక్షులు కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు)
మన రాష్ట్రం నుండి పీఎం జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ క్రింద 878 గ్రామాల ఎంపిక చేయడం , ఈ పథకం
ద్వారా రానున్న ఐదేళ్లలో ఐదువేల కోట్లు వచ్చే అవకాశం ఉందని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం పట్ల గిరిజన గ్రామాలకు మంచి రోజులు రానున్నాయని అరకులో బుధవారం నాడు జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి అధ్యక్షులు కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు) హర్షం వ్యక్తం చేశారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా తాగునీరు, రోడ్లు రహదారి సౌకర్యాలు,పక్కా గృహాల నిర్మాణం వల్ల గిరిజన గ్రామాలకు మహార్దశ పట్టనున్నదని, దేశవ్యాప్తంగా కనీస సౌకర్యాలు లేని గిరిజన రెవెన్యూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని వచ్చే నెలలో ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నందుకు, యావత్ ఆదివాసి సమాజం ప్రధాని నరేంద్ర మోడీకి రుణపడి ఉంటుందని, ఈ సందర్భంగా కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు) కొనియాడారు,
ఈ పథకం కింద నవంబర్ నుండి పనులు ప్రారంభిస్తున్నందున సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి అధ్యక్షులు కారం
సీతారామన్న దొర (ఢిల్లీ బాబు) మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం కింద మన రాష్ట్రంలో 18 జిల్లాల పరిధిలో 878 గ్రామాలు ఎంపిక అయ్యాయని, దేశవ్యాప్తంగా ఈ పథకానికి వచ్చే ఐదేళ్లలో 79 వేల కోట్లు ఖర్చు చేయనున్నారని,
కనీసం 500 జనాభా ఉండి అందులో 50% గిరిజనులు ఉన్న రెవెన్యూ గ్రామాల అభివృద్ధికి ఈ నిధులను వెచ్చించనున్నారని , గిరిజన గ్రామాల అభివృద్ధికి ఐదువేల కోట్ల వరకు మన రాష్ట్రానికి అందే అవకాశం ఉందన్నారు.
ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం కింద ఎంపిక చేసిన గిరిజన గ్రామాల్లో 25 రకాల అభివృద్ధి పనులు చేపడతారని, రహదారులతో పాటు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం, రక్షిత మంచి నీరు, విద్యుత్ విద్య,వైద్య సౌకర్యాలు, నూతన గృహ నిర్మాణం , గ్యాస్ కనెక్షన్లు, మారుమూల ప్రాంతాలకు టెలిఫోన్ సౌకర్యం, పాఠశాలలు, అంగన్వాడి
కేంద్రాలు, మార్కెట్ , ఇలా 25 రకాల సదుపాయాలు కల్పిస్తామని నరేంద్ర మోడీ
ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మిషన్ అంత్యోదయ సర్వేలో భాగంగా ఇప్పటికే
కేంద్రం 878 గ్రామాల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులు ప్రాథమిక జాబితాను పీఎం గతి శక్తి పోర్టల్లో ఉంచిందని దీన్ని ఆయా శాఖల అధికారులు పరిశీలించి ఆయా పనులు చేపట్టేందుకు అనుమతులు కోరుతూ అక్టోబర్ నెలలోపు నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి పంపాలని
అధికారులను కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు) ఈ సందర్భంగా కోరారు.