ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
37 లక్షలతో పేషెంట్ సహకుల గది నిర్మాణం
బ్లడ్ ప్లేట్లెట్స్ వేరు చేసే యంత్రం ద్వారా సత్వర చికిత్స లభ్యత
భూపాలపల్లి నేటిధాత్రి
శుక్రవారం వంద పడకల ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తో కలిసి బ్లడ్ ప్లేట్లెట్స్ వేరు చేసే యంత్రం, పేషెంట్ సహయకులు వేచి ఉండు గదిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన అన్ని వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. బ్లడ్ ప్లేట్లెట్స్ వేరు చేసే యంత్రం ద్వారా ప్రజలకు మరింత వేగంగా వైద్య సేవలు అందుతాయని కలెక్టర్ తెలిపారు.
ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సహాయకుల కోసం 37 లక్షల వ్యయంతో ప్రత్యేక గదిని నిర్మించామని, ఇందులో రోగుల సహాయకులకు అవసరమైన కుర్చీలు టీవీ, ఏసి, ఫాల్ సీలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. భూపాల్ పల్లి లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వరంగల్ తరహాలో కేసు షీట్ల ద్వారా ఆసుపత్రికి వచ్చే ప్రతి పేషెంట్ ఆరోగ్య పరిస్థితిపై మరింత పారదర్శకత కల్పించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో డెంగ్యూ కేసులు అధికమవుతున్నాయని ఈ సమయంలో ప్రజలకు సత్వర వైద్య చికిత్సలు అందించేందుకు బ్లడ్ ప్లేట్లెట్స్ వేరు చేసే యంత్రం ఉపయోగపడుతుందని తెలిపారు.
రోగుల సాయకుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక షెడ్ నందు మంచినీటి సౌకర్యం ఇతర అవసరమైన వాళ్లకి వసతులు కల్పించడం జరుగుతుందని భూపాలపల్లి ఆసుపత్రిలో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని ప్రజలలో నమ్మకం కలుగుతుందని, భవిష్యత్తులో మరింత విశితంగా సేవలు అందించడం జరుగుతుందని ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న చదువుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి కి చెందిన రోగుల కేసు షీట్లను ఆవిష్కరించినారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆస్పత్రి సూపర్డెంట్ నవీన్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట్ రాణి సిద్దు , ఎంపీపీలు, జడ్పిటిసిలు మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ నరసింహారావు, జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ రమేష్ గౌడ్ మహిళలు, ప్రజా ప్రతినిధులు, వైద్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.