జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజుద్దీన్
జైపూర్, నేటి ధాత్రి :
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో హనుమాన్ గుడి దగ్గర హనుమాన్ దీక్ష స్వాములకి ఇందారం గ్రామ నివాసి జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజుద్దీన్ గురువారం సాయంత్రం అల్పాహారం,పండ్లు, పండ్లరసం అందించడం జరిగింది. అలాగే శుక్రవారం రోజున ఇందారం వేణుగోపాలస్వామి గుడిలో హనుమాన్ దీక్ష స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. మరియు స్వాములకు చిరుకానుకగా గ్లాసులు ఇవ్వడం జరిగింది. జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజుద్దీన్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఎప్పుడు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఇందారం గ్రామంలో అందరూ కలిసి మెలిసి ఉంటామని, రంజాన్ పండుగలకు ఇఫ్తార్ పార్టీలతో మా గ్రామ సహోదరులు మాతో కలిసి ఉంటారని,మేము హనుమాన్ స్వాములకు అయ్యప్ప స్వాములకు, వినాయక నవరాత్రులకు వారితో కలిసి మెలిసి జరుపుకుంటామని ఈ మత సామరస్యం, ఐకమత్యం ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవుడితో ప్రార్థిస్తున్నానని అన్నారు. గ్రామంలో ఉన్న సుమారు 20 కులాలు బంధువులాగా, అన్నదమ్ములుగా వరుసలతో కాకా, మామ, బావ అంటూ పిలుచుకుంటూ కలిసిమెలిసి ఉంటారని,అలా ఉంటేనే గ్రామం బాగా అభివృద్ధి చెందుతుందని, గ్రామ ప్రజలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ముఖ్యంగా మా గ్రామ యువత మంచి ఉద్యోగాల్లో ఉండాలని మనసారా కోరుకుంటున్నానని, హనుమాన్ దీక్ష స్వాములు వారి భక్తితో గ్రామం అభివృద్ధి చెందాలని ఆ దేవుని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష స్వాములు మరియు జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి ,మాజీ సర్పంచ్ చిప్ప కుర్తి దుర్గయ్య, మాజీ ఎంపీటీసీ లు సుంకర శ్రీనివాస్ , లక్ష్మణ్ ,తోకల శ్రీనివాస్, గుడిగందుల లక్ష్మీనారాయణ, సాగర్, గౌసి గయాజ్ మరియు హనుమాన్ భక్తులు,సేవకులు పాల్గొన్నారు.