దగాపడ్డ కళాకారుల డప్పుల మోత పోస్టర్ ఆవిష్కరణ.

చిట్యాల, నేటిధాత్రి ;

పాటల పల్లకిలో 32 గంటలు దగాపడ్డ కళాకారుల డప్పుల మోత పోస్టర్ చిట్యాల మండల కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కళాకారుల సంఘం నాయకులు జన్నె యుగేందర్ , జిల్లా ఇంచార్జి కొండ్ర కుమార్ హాజరై మాట్లాడుతూ నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు కల్పించాలని ఈనెల 12, 13 తేదీల్లో పాటల పల్లకిలో 32 గంటల దగాపడ్డ కళాకారుల డప్పుల మోత కార్యక్రమం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నదని, మన ప్రముఖ కవి గాయకులు నేర్నాల కిషోర్ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు మన రాష్ట్ర మంత్రులు మరియు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు మరియు తెలంగాణ ప్రముఖ కళాకారులు వస్తున్నారనీ అన్నారు అందుకు మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కళాకారులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 12 ,13 వ తేదీన జరుగబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు ఈ కార్యక్రమంలో జానపద గేయ రచయితలు దాసారపు నరేష్ , మ్యాదరి సునీల్ , వైనాల రమేష్,గాయకులు పుల్ల ప్రతాప్, కోట మహేష్, మంద జగన్, దుడపాక శ్రీనివాస్ , డప్పు రాజు తదితరుల పాల్గోన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version