ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో బుధవారం రోజున నూతన ఎస్ఐ గా డి.రమేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ చట్టానికి ఎవరు చుట్టాలు కారని తప్పులు చేస్తే ఎంతటి వారినైనా ఆపేక్షించేది లేదని, ప్రజలు ఏ సమస్య వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని,ఎలాంటి పైరవీలకు తావు లేదని అన్నారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు జరగకుండా ప్రతిష్టమైన ఏర్పాటు చేస్తామని, ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.