భద్రాచలం నేటి ధాత్రి
సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ పారెల్లి జానయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహంపై పార్టీ జెండాను పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి ఎర్రజెండా కప్పి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ పట్టణ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కామ్రేడ్ జానయ్య గారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు యూ టి.ఎఫ్ లో పనిచేస్తుండగా చిన్న కుమారుడు పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యునిగా, నవ తెలంగాణ బాధ్యులుగా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు పార్టీ సభ్యులుగా ఉన్నారు. కామ్రేడ్ జానయ్య పార్టీ పట్ల అచంచల విశ్వాసంతో పని చేసేవారు. పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడుతూ కామ్రేడ్ జానయ్య మృతి పార్టీకి, కుటుంబానికి తీరని లోటని అన్నారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.నివాళులు అర్పించిన వారిలో పార్టీ పట్టణ కార్యదర్శి పార్టీ సీనియర్ నాయకులు బిబిజి తిలక్, జిఎస్ శంకర్రావు, జిల్లా కమిటీ సభ్యులు యం.రేణుక, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు, ఎర్రం శెట్టి వెంకటరామారావు, నాదెళ్ల లీలావతి, నాయకులు పట్టణ కమిటీ సభ్యులు యూత్ జ్యోతి లక్ష్మణ్ కోరాడ. శ్రీనివాస్ నకిరేకంటి నాగరాజు, కుంజా శ్రీనివాస్, చుక్క మాధవరావు, మరియు కొత్త కాలనీ పార్టీ శాఖ సభ్యులు ఉన్నారు.
సంతాపం ప్రకటించిన రాష్ట్ర, జిల్లా నాయకులు
కామ్రేడ్ జానయ్య మృతి పట్ల పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతునేని సుదర్శన్రావు, డాక్టర్ మిడియం బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, అన్నవరపు కనకయ్య మచ్చా వెంకటేశ్వర్లు ఏజే రమేష్, పార్టీ సీనియర్ నాయకులు ఎలమంచి రవికుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి,కే బ్రహ్మచారి, కారం పుల్లయ్య,లు సంతాపాన్ని తెలియజేశారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.