భూపాలపల్లి నేటిధాత్రి
వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపడుతున్నట్లు భూపాలపల్లి మున్సిపాలిటీ 6వ వార్డు క్రిష్ణకాలని కౌన్సిలర్ ఎడ్ల మౌనిక కరాటే శ్రీనివాస్ అన్నారు. అందులో భాగముగా శనివారం మున్సిపల్ సిబ్బందిచే మంచి నీటి బోర్లకు మరమ్మత్తులు చేయించారు. అనంతరం పారిశుధ్య కార్మికులచే సైడ్ కాలువలు శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.