రైతుల వడ్లకు బోనస్ ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర

వనపర్తి నేటిదాత్రి:
రైతులు ప్రజలు విద్యార్థులు ఓట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిందని టిఆర్ఎస్ మీడియా సెల్ ఇన్చార్జి నందిమల్ల అశోక్ సింగిల్ విండో అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ సునీల్ వాల్మీకి జోహేబ్ హుస్సేన్ చిట్యాల రాము వనపర్తి లో విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వారి చేతుల మీదగా కాంగ్రెస్ పార్టీ రైతుల మేనిఫెస్టో డిక్లరేషన్ విడుదల చేసిందని అన్నారు . వడ్లకు 500 జొన్నలకు 330 చెరుకు 8 30 ఎండుమిర్చి పసుపు 550 పప్పు లకు 350 మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని రైతులకు హామీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు . తెలంగాణ రాష్ట్రంలో వర్షానికి తడిసిన వడ్లను ఒక్క గింజ కూడా వదలకుండా పండించిన వాటిని కొనాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలు అయ్యాయని కరెంటు కోతలు లేకుండా నివారించాలని రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు రైతులు పండించిన వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వకుండా కుట్ర చేస్తుందని వారు మండిపడ్డారు వెంటనే రైతులకు బోనస్ రుణ మాఫీ విద్యు విద్యుత్తు కోతల్ లేకుండా 24 గంటల విద్యుత్ ను అమలు చేయాలని వారు కోరారు టి ఆర్ ఎస్ ప్రభుత్వంలో రైతులకు పరిశ్రమలకు గృహాలకు విద్యుత్ కోత లేకుండా చేసిందని వారు గుర్తు చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version