తెలంగాణ కబళించాలని కుట్రలు చేస్తున్నారు

# ప్రపంచ చరిత్రలో హైదరాబాద్ ఐటీ రంగం అభివృద్ధి

# తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ కావాలి.

# కాంగ్రెస్ పార్టీకి వారి పథకాలకు గ్యారంటీ లేదు.

# ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక ఉద్యమకారుడు.

# ఉద్యమ కారున్ని కొల్పేతే ప్రజలు ఇబ్బందులకు గురైతారు.

# పెద్దికి మద్దతుగా బి అర్ ఎస్ ఎన్నారై ఫోరం

# తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్,ఎన్నారై యూకే వ్యవస్థాపక అద్యక్షులు అనీల్ కుర్మాచలం.

# ఎన్నారై యూఎస్ఏ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ తన్నీరు మహేష్ .

నర్సంపేట,నేటిధాత్రి :

ఉద్యమ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్వర్యంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్నది.ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కబళించాలని వివిధ పార్టీలు కుట్రలు చేస్తున్నారని ఎన్నారై యుఎస్ఎ సెల్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేష్ తన్నీరు ఆరోపించారు.నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కొల్పేతే ఇక్కడి ప్రజలు ఇబ్బందులకు గురైతారని తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నారై యుకే వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి మద్దతుగా వివిధ దేశాల్లో ఉన్న బిఅర్ఎస్ ఎన్నారై సెల్ ప్రతినిధులు ప్రచారంలో పాల్గొన్నారు.
బి అర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు శానబోయిన రాజ్ కుమార్,పిన్నా బాస్కర్ ఆద్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిధులుగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్,ఎన్నారై యూకే వ్యవస్థాపక అద్యక్షులు అనీల్ కుర్మాచలం, ఎన్నారై యూ.ఎస్.ఏ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ తన్నీరు మహేష్ లు హాజరయ్యారు.
మహేష్ తన్నీరు మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు అని పేర్కొన్నారు.గెలిచిన తక్కువ సమయంలో నర్సంపేటలో పెద్ది చేసిన అభివృద్ధి కనపడుతున్నదని అన్నారు.ప్రతిపక్షాలు రకరకాల కుట్రలతో ప్రజలను మాయచేసి ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు వెనకపడ్డాయని, వెనకపడ్డ రాష్ట్రాలలో తెలంగాణ
ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో మొదటిస్థానంతో ముందుకు పోయిందని పేర్కొన్నారు.అనాడు ఉద్యమంలో సమయంలో
వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలము తెలంగాణ కోసం సహకరించామని నేడు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుతూ మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చామని మహేష్ తెలిపారు.నేడు ఇతర రాష్ట్రాల వారు తెలంగాణలో జరిగే అభివృద్ధిని చూసి ఈర్ష్య పడుతున్నారని అంటూ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నదని మహేష్ తన్నీరు చెప్పారు.కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీ రామరక్ష, పెద్ది నాయకత్వమే నర్సంపేటకు రక్ష అని తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నారై యుకే వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఖండంతరాలు దాటినా మేము తెలంగాణ ప్రాంత బిడ్డలమని,ఈ ప్రాంత అస్థిత్వాన్ని కాపాడే ఏకైక నాయకత్వం కేసీఆర్ అని ప్రజల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించారని తెలిపారు.ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నాయకుడు మాత్రమే కాకుండా ఒక విజన్ ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు.ఉద్యమంలో జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప వ్యక్తి,ఎన్నో పోరాటాల్లో బాగమైన ఆయన ఎన్నికైన ఐదేళ్ళలోనే నర్సంపేట దశ దిశను మార్చారని నర్సంపేట అభివృద్ధి మరింత జరగాలంటే పెద్ది సుదర్శన్ రెడ్డి మరోమారు బారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ లేదు వారి పథకాలకు గ్యారంటీ లేదు అని ఎద్దేవా చేశారు.కాంగ్రేస్ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొరపాటున మోసపోతే తెలంగాణ మరో 10ఏండ్లు వెనక్కివెలుతుందన్నారు.దుష్టశక్తులంతా ఏకమై రాష్ట్రాన్ని రావణకాష్టం చేయాలని చూస్తున్నారని,కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని అనిల్ కర్మాచలం తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాద్యక్షులు నవీన్ రెడ్డి,ఎన్నారై బీఆర్ఎస్ యూఎస్ఎ పిన్న బాస్కర్,బిందు లత,ఎన్నారై బీఆర్ఎస్ యూకే కడుదుల రత్నాకర్,గొట్టెముక్కుల సతీష్ రెడ్డి,మదుయాదవ్,శానబోయిన రాజ్ కుమార్,బీఆర్ఎస్ ఆస్ట్రేలియా కొరబోయిన విజయ్,సాంబరాజు వీరేందర్,స్థానిక నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version