కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేస్తుంది

బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి చందుపట్ల కీర్తి రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ జిల్లా కార్యాలయంలో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన క్రమశిక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మాతినేని ధర్మారావు హాజరైనారు అనంతరం మాట్లాడుతూ అధికారకాంక్షతో దేశాన్ని తామే ఎన్నటికీ పరిపాలించాలని రాక్షస మనస్తత్వంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశానికి జాతీయ అత్యవసర పరిస్థితి (నేషనల్ ఎమర్జెన్సీ) యావత్ దేశాన్ని చీకట్లోకి నెట్టివేసిందని జూన్ 25 ను బ్లాక్ డేగా అభివర్ణించారు
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజు నగర్ బుధవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆనాడు అలహాబాద్ హైకోర్టు ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ ఎన్నిక సరి అయింది కాదని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చిందని దాని నుండి బయటపడడం కోసం చట్టాలను రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని వాక్ స్వతంత్రాన్ని పత్రిక స్వేచ్ఛను హరిస్తూ అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 1975 జూన్ 25న జాతి అత్యవసర పరిస్థితి విధించి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ యావత్ దేశాన్ని చీకట్లోకి నెట్టు వేసింది తామే అధికారంలో ఉండాలని తమ కుటుంబం మాత్రమే దేశాన్ని పరిపాలించాలని అధికారకాంక్షతో ప్రజాస్వామ్య విలువలను వాక్ స్వతంత్రాన్ని పత్రిక స్వేచ్ఛను హరిస్తూ జయ ప్రకాష్ నారాయణ మాజీ ప్రధాని మురార్జీ దేశాయ్ వంటి రాజకీయ సామాజిక కార్యకర్తలను జైళ్ళ పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగ గురించి మాట్లాడుతుందని చివరిగా జరిగిన పార్లమెంటు ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల మధ్య కులాల మధ్య అబద్దాలను ప్రచారం చేస్తూ తద్వారా అధికారం చేపట్టవచ్చు అనే భావంతో వ్యవహరించిందని భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే విధంగా భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల మోడీ పాలనలో 80 లక్షల మంది బిపిఎల్ నుండి ఏ పీఎల్ కు చేరారని ఆహార భద్రత చట్టం తీసుకువచ్చి బిజెపి మూడోసారి అధికారం చేపడితే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాయి అనే అబద్ధపు ప్రచారాలు చేశారని అన్నారు తెలంగాణలో 1969 ఉద్యమంలో 369 మంది యువకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రతిపక్షాలను లేకుండా చేశాయని యావత్ దేశంలోని 654 జిల్లాలలో యాంటీ ఎమర్జెన్సీ డే కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు గరేబి హటావో నినాదం మాత్రమేనని క్షేత్రస్థాయిలో పేదవారి కోసం ఏమీ చేయలేదని పేదలకు బలహీనులకు అవకాశాలు లేవని పోలీస్ పటేల్ వ్యవస్థ కొనసాగించాలఅనేదే కాంగ్రెస్ పార్టీ నైజాం అని
రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమం లో రాష్ట్ర అధికారిక ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు ఏడు నూతల నిషిధర్ రెడ్డి చదువు రామచంద్రారెడ్డి వెన్నంపల్లి పాపయ్య లింగంపల్లి ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version