నడికూడ,నేటి ధాత్రి:
సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను మంగళవారం నడికూడ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. అనంతరం దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ సోమవారం మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన,ఆయన అధికార పార్టీలో ఉన్నట్లు భ్రమలో ఉండి మాట్లాడడం సరైంది కాదని, ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కాంగ్రెస్ కార్యకర్తలు మీకు దేహశుద్ధి చేయడం తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహాల్ రావు, గ్రామ కమిటీ అధ్యక్షులు తాళ్ల నవీన్, సోషల్ మీడియా మండల కో- ఆర్డినేటర్ కోడెపాక ప్రశాంత్, మండల యూత్ అధ్యక్షులు అప్పం కుమార స్వామి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వనపర్తి నవీన్, మండల కోశాధికారి తలగంప రాజు, మండల యువ నాయకులు పాడి వివేక్ రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు బొట్ల రవీందర్,గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి జీల శ్రీనివాస్, పలు గ్రామాల కమిటీ అధ్యక్షులు చాడా రవీందర్ రెడ్డి, బల్లు రమేష్, దేవు రమేష్, బందెల దామోదర్, మొగిలి, సురేందర్,విజేందర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
