చలో హైదరాబాద్ కార్యకమానికి బయలుదేరిన పరకాల కాంగ్రెస్ నాయకులు

పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర పీసీసీ,రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎల్బి స్టేడియం హైదరాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి బూత్ లెవెల్ అద్యక్షుల సమావేశానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే హాజరుకానున్నారు.పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు పరకాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరకాల నుంచి మూడు ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరినారు.ఈ కార్యక్రమానికి పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్,పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీను,డిసిసి హన్మకొండ జిల్లా చైర్మన్ దాసరి బిక్షపతి, రాయపర్తి ఎంపిటిసి పర్నెం మల్లారెడ్డి,లక్ష్మీపురం ఎంపిటిసి పల్లెబొయిన శ్రీనివాస్,పరకాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడ దొమ్మటి కృష్ణకాంత్,టౌన్ యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు మచ్చ సుమన్.మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారయాణ,గాదె శంకరయ్య,ఇనగాల రమేష్, పరకాల మండల ఎస్సి సెల్ సెల్ అధ్యక్షుడు బొమ్మకంటి చంద్రమౌళి,నాగారం గ్రామ ఉప సర్పంచ్ కోసరి రాజు,లక్ష్మీపురం గ్రామ ఉప సర్పంచ్ ఆముదాలపెల్లి క్రాంతి, వివిధ గ్రామ కమిటీ అధ్యక్షులు,బూత్ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version