బి ఆర్ ఎస్ పార్టీ నాలుగో వార్డ్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు పై కాంగ్రెస్ నాయకుడు పోచమ్మల గణేష్ దాడి

రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి

రామాయంపేట బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాలుగో వార్డ్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు పై కాంగ్రెస్ నాయకుడు పోచమ్మల గణేష్ పెట్రోల్ తో దాడి చేయడాని టిఆర్ఎస్ నాయకుడు కంట రెడ్డి తిరుపతిరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సారాపు యాదగిరి తీవ్రంగా ఖండించారు…… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయంపేట పట్టణంలో ఇంతవరకు ఎప్పుడు జరగని పరిణామాలు చోటు చేసుకోవడం విచారకరమన్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం చంపడానికి చూడడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటనలకు అధికార కాంగ్రెస్ పాల్పడుతుందని పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు పై కాంగ్రెస్ నాయకుడు పెట్రోల్ పోసి చంపడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. ఇలాంటి సంస్కృతి ఇప్పటివరకు రామాయంపేట పట్టణంలో జరగలేదన్నారు. కానీ కొందరు అధికార పార్టీ అండ చూసుకొని ఇలాంటి సంఘటనకు పాల్పడుతుదన్నారని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుఅని అన్నారు. ఈ దాడికి కారణం పోచమ్మల గణేశా? అతని వెనుక ఎవరైనా ఉండి చేస్తున్నారా అనే విషయాన్ని పోలీసులు సమగ్రంగా పరిశీలించాలని వారిని కఠినంగా శిక్షించాలని ఇప్పుడే 307 సెక్షన్ కింద అటెంప్ట్ మర్డర్ కేస్ నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే పోలీసులు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా హైదరాబాదులో డిఐజికి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. మెదక్ వెళ్లి ఎస్పీకి దీనిపై ఫిర్యాదు చేయడమే కాకుండా సక్రమంగా కేసును పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version