మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
78 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ
నిజాంపేట, నేటి ధాత్రి
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక సబ్ మార్కెట్ యార్డులో శుక్రవారం రోజున లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.మండల కేంద్ర వ్యాప్తంగా 78 కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయని పనులు 8 నెలలలోనే చేసి చూపించమన్నారు దీనికి ఉదాహరణ మెదక్ లో ప్రభుత్వ వైద్య కళాశాల సాధించిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. గత ప్రభుత్వం అప్పుల కుప్పచేసి దాచుకోవడం దోచుకోవడం దేయంగా పెట్టుకున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సురేష్ కుమార్, ఆర్ ఐ గంగాధర్, జిల్లా కార్యదర్శి పంజా మహేందర్ ,తాజా మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు, మాజీ సర్పంచుల పోరం అధ్యక్షుడు అమరసేనారెడ్డి, మండల అధ్యక్షుడు మారుతి, పట్టణ అధ్యక్షుడు నశిరుద్దీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగం గౌడ్, వెంకటేష్, అజయ్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు