ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి-దొమ్మటి సాంబయ్య

పరకాల నేటిధాత్రి
పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో పరకాల నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న మరియు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ కంటెస్టెడ్ ఎంపీ దొమ్మటి సాంబయ్య పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇటీవలే ఓటరు జాబితా షెడ్యూల్ ను విడుదల చేసిన ఈసి ఫిబ్రవరి 06 లొపు ఖమ్మం,నల్గొండ,వరంగల్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియను పట్టుబద్రులందరూ 2020 నవంబర్ లొపు ఉన్న ప్రతి ఒక్క ఓటరు ఫామ్ 18నింపి ఏంఆర్వో కి పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారూ,ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పరకాల నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు అందరూ పట్టుభద్రుల ఓటర్ మహాశయులను కలిసి దగ్గరుండి వారిని నమోదు చేపించి త్వరలో వెల్లడించే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ పక్షాన భారీ మెజారిటీతో గెలిపించాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎంపిపి తక్కళ్లపెల్లి స్వర్ణలత,నియోజకవర్గం లోని ప్రజా ప్రతినిధులు,వివిధ మండలాల కమిటీ అధ్యక్ష కార్యవర్గం,జిల్లా ముఖ్య నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version