ఉపాధి హామీ కూలీలను కలిసి ఓటు అడిగిన కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ!!

బారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపు నిచ్చిన మహ్మద్ బషీర్!!
వెల్గటూర్ నేటి ధాత్రి
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద పల్లి పార్లమెంట్ పరిధిలోని వెల్గటూర్ మండలం తాళ్ల కొత్తపేట మరియు చెగ్యాం గ్రామాల లో ప్రచారంలో భాగంగా బుధవారం ఉపాధి హామి కూలీలను కలిసిన ఎంపి అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ రానున్న ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రస్థుత ఎండపల్లి ఎంపిటిసి సభ్యులు బషీర్ మాట్లాడుతూ గతంలో మేము రజియా బషీర్ ఎంపీపీ గా పని చేసిన సమయంలో అప్పటి శాసన సభ్యులు కొప్పుల ఈశ్వర్ ముంపు గ్రామాలను 50శాతం మాత్రమే తీసుకుంటే అప్పటి ఆయా గ్రామాల నాయకులు వారి గ్రామాల ముంపు శాతం ను పెంచవలిసిందిగా రజియా బషీర్ కోరగా తక్షణమే స్పందించి వారు పై విషయాన్ని పెద్దలు కాకా వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ద్వారా ముంపుగ్రామాలను 100శాతం చేశారు ఈ విషయాన్ని ప్రజలు కూడా గుర్తుకు చేసుకున్నారు అలాగే రానున్న ఎన్నికలలో కాకా మనువడు గడ్డం వంశీకృష్ణ ని బారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు వంశీకృష్ణ వారి తాత కాక బాటలోనే నడుస్తూ ప్రజల సమస్యలను తీర్చుటలో ముందు వరుసలో ఉంటారని తెలియ చేశారు ఈ కార్యక్రమం లో పీసీసీ కార్యవర్గ సభ్యులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలెందర్ రెడ్డి చెగ్యాం ఎంపిటిసి రంగు తిరుపతి ముత్తునూరు ఎంపిటిసి మంజుల నాయకులూ రామ్మోహనరావు గాజుల విజయ్ పొట్లపల్లి సత్యనారాయణరావు తుమ్మల గోపాల్ రెడ్డి తోడేటి బాల్ లింగ గౌడ్ దేవి రవీందర్ కనుకుంట్ల రఘువర్ధన్ రవితేజ పవన్ నరేష్ సాయి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version